మోదీ గొప్ప సేల్స్మ్యాన్.. అందుకే మేం ఓడిపోయాం!
posted on Jun 24, 2019 5:45PM
ప్రధాని మోదీ గొప్ప సేల్స్మ్యాన్. అందుకే బీజేపీ మరోసారి అధికారంలోకి రాగలిగింది అని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్సభలో నేడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధిర్ మాట్లాడుతూ.. ‘మన ప్రధాని గొప్ప సేల్స్మ్యాన్. ఆయన ముందు మేం మా ఉత్పత్తులను విక్రయించలేకపోయాం. అందుకే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది’ అని అన్నారు. రాష్ట్రపతిని విమర్శించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని, అయితే అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్నామని అధిర్ తెలిపారు. దేశం తీవ్రమైన కరవు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కనీసం ఆందోళన చెందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. 2జీ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎందుకు జైల్లో లేరని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని పొగడడం తప్పించి వేరే పని చేయట్లేదని ఎద్దేవా చేశారు. ‘ప్రధానిని పొగిడితే చాలు.. మేం గట్టెక్కుతాం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని అధిర్ ఆరోపించారు.