లోక్ సభకు మోడీ.. రేపటికి వాయిదా..

 

పార్లమెంట్ ఉభయసభలకు ప్రధాని నరేంద్ర మోడీ రావాలని.. నోట్ల రద్దుపై ఆయన స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఉభయసభల్లో ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ప్రధాని మోడీ లోక్ సభకు వచ్చారు.  కానీ స‌భ ప్రారంభ‌మైన కొన్ని క్ష‌ణాల‌కే నోట్ల ర‌ద్దు దుమారంతో వాయిదా వేశారు. ప్రధాని రాకపై స్పందించిన ప్రతిపక్షాలు.. ప్ర‌ధాని మోదీ కేవ‌లం స‌భ‌కు వ‌స్తే స‌రిపోద‌ని, ఆయ‌న ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా ప్రతిపక్షాలు తమ ఆందోళనలు ఆపని నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు.