మోడీ తల్లికి నోట్ల కష్టాలు.. బ్యాంకు వద్ద క్యూలో

 

పాత నోట్ల మార్పిడికి సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బంది సాక్షాత్తు ప్రధాని తల్లికి కూడా వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ నోట్ల మార్పిడి కోసం ఓ సాధార‌ణ వ్య‌క్తిలా బ్యాంకుకు వెళ్లారు. గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో ఓ బ్యాంకుకు వెళ్లిన ఆమె..క్యూలో నిల‌బ‌డి మ‌రీ త‌న ద‌గ్గ‌ర ఉన్న పాత నోట్ల‌ను మార్పిడి చేసుకున్నారు. ఆమె వెంట కొంద‌రు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. కొత్త నోట్లు తీసుకున్న త‌ర్వాత ఆమె వాటిని మీడియాకు చూపించారు.