మోడీ జపాన్ పర్యటన ఖరారు..


ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటన ఖరారైంది. నవంబర్ 11, 12వ తేదీల్లో మోదీ జపాన్‌లో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా జపాన్ చక్రవర్తితో ఆయన భేటీ కానున్నారు. అదేవిధంగా వార్షిక సమావేశంలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబేతో జరిగే చర్చల్లో కూడా మోదీ పాల్గొననున్నారు.