గాంధీ కుటుంబంపై మోడీ ఫైర్..

ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన గాంధీ కుటుంబ సభ్యులపై విమర్శల బాణాలు వదిలారు. పార్లమెంటులో కీలక చట్టాలను, సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని.. 2014 ఎన్నికల్లో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో అని అన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు నన్ను వ్యతిరేకించినా పార్లమెంటు మాత్రం తనపని తాను చేసుకుపోవాలని కోరుకుంటున్నారు. కానీ ఒక కుటుంబం మాత్రం మొండిగా వ్యవహరిస్తూ రాజ్యసభ పనిచేయకుండా అడ్డుకుంటున్నది అని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం మాట వినే ప్రభుత్వం అస్సాంలో ఏర్పడితే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు. ప్రసంగానికి ముందు స్థానిక సంప్రదాయిక భేరీని మోగించారు.