మీడియా కెమెరాలను ఆపేయండి: కేటీఆర్

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక సమావేశంలో పాల్గొన్న సందర్భంలో తనను చిత్రీకరిస్తున్న మీడియా కెమెరాలను ఆపేయాలని కోరారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్‌ ఫర్‌ తెలంగాణ' పేరిట నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా 1956 స్థానికత గురించిన ప్రశ్న ఎవరో అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేముందు కేటీఆర్ మీడియా కెమెరాలను ఆపేయాలని సూచించారు. తాను తన తండ్రి కలిసే ఉంటున్నామని స్థానికత విషయం గురించి మాట్లాడేటప్పుడు మా ఇద్దరి మధ్య అపోహలకు తావు లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలి అంటూ కేటీఆర్ మీడియా కెమెరాలు ఆపేశాక 1956 స్థానికత అంశం మీద మాట్లాడారు. స్థానికత అంశం మీద తాను మాట్లాడిన మాట ఒకలాగా, తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు మరోలాగా వుంటే మీడియా ఊరుకోదన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అలా మీడియా కెమెరాలను ఆపేయాల్సిందిగా సూచించారని తెలుస్తోంది.