జగన్ అరెస్ట్ కు రంగం సిద్ధం
Published on: Mon Apr 16, 2012 10:56AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం గనులతో సహా అక్రమ ఆస్థులకు సంబంధించిన కేసులో జగన్ మొదటి ముద్దాయిగా వున్నారు. జగన్ అక్రమ ఆస్టుల కేసు విషయంలో సిబీఐ ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తుందని ప్రజలు భావించడంతోపాటు జగన్ కు ఆస్థులు సమకూర్చే విషయంలో తన ప్రతిభను చాటిన విజయసాయి రెడ్డిని రెండవ ముద్దాయిగా పేర్కొనడంతో పాటు అరెస్టు చేసినందుకు సిబీఐకి జాయింట్ డైరెక్టర్ ను ఒక హీరోగా చూశారు.
అయితే ఇదే సమయంలో కేసులో మొదటి ముద్దాయిగా వున్న జగన్ ను అరెస్టు చేయకపోవడంతో సిబీఐ విశ్వసనీయతను ప్రజలు అనుమానించడం ప్రారంభించింది. మొదటి ముద్దాయి స్వేచ్చగా తిరుగున్నప్పటికీ పట్టించుకోకుండా రెండో ముద్దాయిని అరెస్టు చేయడం, అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని కోరడం పట్ల చివరకు సిబీ కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. నిజానికి సిబీఐ కూడా ఇతరహ వ్యాఖ్యాలకోసమే ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ను ఇతరుల తరహాలో అరెస్టు చేసేపక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నిరసన, బంద్ లకు పిలుపు ఇవ్వడం, రాస్తారోకోలు వంటి ఆందోళనలకు దిగే అవకాశం వుంది. దాంతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం వుంటుంది. మొదటి ముద్దాయిగా వున్న జగన్ ను అరెస్టు చేయకపోవడం వల్ల ప్రజలలో చర్చజరగడం, చివరకు కోర్టు కూడా అసహనం వ్యక్తం చేయడం వంటి అంశాల మేపత్యంలో రేపు జగన్ ను అరెస్టు చేసినా ప్రజలు సాధారణ అంశంగా భావించే అవకాశం వుంది. ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబీఐ అధికారులు మూడు గంటలపాటు విచారించడం, సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్ళడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే జగన్ ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం వుందని భావిస్తున్నారు.


