ఈ నెల ఏడున పులిచింతల శంకుస్థాపన

 

ఈ నెల ఏడున పులిచింతల ప్రాజెక్ట్‌కు సియం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మాద్యమిక విధ్యాశాఖ మంత్రి పార్థసారధి చెప్పారు. ముందుగా ఎనిమిదో తేదిన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారని ప్రకటించినా ఆ రోజు సియంకు వేరే కార్యక్రమాలు ఉండటంతో ఒకరోజు ముందుగానే ప్రాజెక్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారు. పులిచింతల్లో ప్రాజెక్ట్‌ ప్రారంభించిన సియం శంకుస్థాపన చేసిన తరువాత విజయవాడ స్వరాజ్‌మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలొ పులిచింతల నమూనా నుంచి నీటి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు.