ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులు
Published on: Fri Sep 20, 2024 6:27PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలన్న హైదరాబాద్ పోలీసుల విజ్ణప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఇంటర్ పోల్కు సీబీఐ లేఖ రాసింది. దీంతో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్రావులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై నాన్బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ప్రభాకర్రావు వర్చువల్గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది.


