సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల సమ్మె
Published on: Tue Apr 17, 2012 1:55PM
వచ్చే సోమవారం నుండి పెట్రోల్ పంపుల యజమానులు పెట్రోల్, డీజిల్ ఇంధనాలపై తమ కమిషన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేయనున్నారు. ప్రతి లీటరు పెట్రోల్పై 27 పైసలు, ప్రతి లీటరు డీజిల్పై 14 పైసలు చొప్పున కమిషన్లను పెంచాలని పెట్రోల్ పంపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి లీటరు పెట్రోల్పై రూ.1.49, ప్రతి లీటరు డీజిల్పై 91 పైసలు చొప్పును ప్రభుత్వం డీలర్ కమిషన్లను అందిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అపూర్వ చంద్ర కమిటీ నివేదికను అమలుపరచడానికి, కొత్త పంపులు ప్రారంభించటానికి మార్గదర్శకాలను నిర్దేశించినట్లయితే, సమ్మెను విరమిస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోల్ ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ అజయ్ బన్సాల్ పేర్కొన్నారు.


