రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

 

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ. 2.58, డీజిల్‌ ధర లీటర్‌కు రూ. 2.26 పెంచింది. మే నెలలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచడం ఇది రెండవసారి. అంతేకాకుండా సబ్సిడీ రహిత గ్యాస్‌ సిలిండర్‌పై 21 రూపాయిలను పెంచింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ ధరను 9.2 శాతం పెంచింది. ఈ ధరలన్నీ మంగళవారం అర్థరాత్రినుంచి అమల్లోకి వచ్చాయి.