TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెంపుడు కుక్కే ప్రాణం తీసేసింది!

Published on: Sat Jul 30, 2022 6:47AM

కుక్కలు విశ్వాసానికి మారుపేరు. తమ ఇంట్లో కుక్కలను పెంచుకునే వారు వాటిని సొంత మనుషుల్లా ప్రేమగా సాకడం చూస్తుంటాం. అయితే అలాంటి పెంపుడు కుక్కే ఓ ఇంట విషాదాన్ని నింపింది.  ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే యజమానురాలిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. పెట్​ డాగ్​ లవర్స్​కి ఇది కాస్త బాధాకరమైన వార్తే.. ప్రేమగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్క దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో ఓ మహిళ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. 
మృతురాలు ఒక రిటైర్డ్ టీచర్, ఆమె కొడుకు జిమ్ ట్రైనర్​గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు పెంపుడు కుక్కలున్నాయి. వాటిలో ఒకటి పిట్‌బుల్. మూడేళ్లుగా ఇంట్లో మనిషిగా అందరి ప్రేమనూ చూరగొన్న ఆ పిట్ బుల్  ఉన్నట్టుండి తన తల్లిపై అటాక్​ చేసిందని చెప్పాడు. ఆ దాడిలో తన తల్లి తీవ్రంగా గాయపడి మరణించిందన్నాడు. దాడి తరువాత    లక్నో మునిసిపల్ కార్పొరేషన్ ఆ కుక్కను నాగర్ నిగమ్ జంతు జనన నియంత్రణ కేంద్రానికి తరలించింది. అక్కడ దాని ప్రవర్తనను పరిశీలిస్తున్నారు.