అసెంబ్లీలో 'నీయమ్మ' అన్న మంత్రి.. అచ్చెన్నాయుడు హర్ట్!

 

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై వైసీపీ నేత, మంత్రి పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడుని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని నాని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న టెక్కలి ప్రజలు రోజూ ఇదేం గోల అని బాధపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. నీయమ్మ ఏంట్రాబాబు ఈ గోల అంటూ ఆవేదన చెందుతున్నారంటూ పేర్నినాని వ్యాఖ్యానించారు. 

పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యలు తప్పని తేలితే వెనక్కి తీసుకుంటానని పేర్ని నాని స్పష్టం చేశారు. అనంతరం సభలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. నాని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాని వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని తెలిపారు. సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ మూడు రోజులుగా బాధపడుతున్నట్లు తెలిపారు. నీయమ్మ, బయటకు రా చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటి ఈ వ్యాఖ్యలు అంటూ ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, వల్గర్ గా అసలు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో ఇక ఉండనంటూ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.