2020 కంటే 2021 యమ డేంజరట! ఇక మానవ జాతి అంతమేనా! 

2020 ప్రపంచ దేశాలకు అత్యంత దుర్భరమైన సంవత్సరం. ప్రపంచ మానవాళిని భయాందోళనలో ఉంచిన ఏడాది. 2020లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. జనాల జీవితాల్లో కల్లోలం రేపింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసింది. మానవ సంబంధాలను తెంపేసింది. పండుగ చేసుకున్నా సింగిల్ గానే.. పార్టీ చేసుకున్నా సింగిల్ గానే.. చివరకు పెళ్లి.. చావు అన్నీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే.. హంగూ ఆర్భాటాల్లేవు.. మంది మార్బలం అంతకన్నా లేదు. ఇంతటి భయంకరమైన 2020కు వీడ్కోలు పలికాం.. కొత్త ఏడాదికి కోటి ఆశలతో స్వాగతం చెప్పాం.. అయితే కొత్త సంవత్సరం తొలి వారంలోనే  ప్రపంచానికి మరో షాకింగ్ వార్త వచ్చేసింది. 

2020 కంటే భయానకమైన పరిస్థితిని 2021లో చూడబోతున్నామట. ఇది చెప్పింది ఎవరో కాదు.. ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్. 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ భవిష్యవాణిలో 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని చెప్పారని చెబుతున్నారు. 2020-21కి సంబంధించి ఆయన చెప్పిన జోస్యంలో.. వర్షం, రక్తం, పాలు, కరువు, దొంగతనాలు, ఓ మహమ్మారి అనేవి విజృంభిస్తాయని వెల్లడించారు. అలాగే వీటి బారిన పడి కోట్ల మంది చనిపోతారని... ఎందరో తల్లులు, తండ్రులు మరణిస్తారని తెలిపారు. బతికున్న వారు సగం చనిపోయిన వారిలా మిగిలిపోతారని వెల్లడించారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని... ఆకాశం ఎర్రగా మారుతుందని తెలిపారు. కాంతి వంతమైన తోక కలిగిన ఓ కిరణం విశ్వం నుంచి భూమికి చేరుతుంది. ఎక్కడ చూసినా కరువు ఏర్పడుతుందంటూ 20వ శతాబ్దానికి సంబంధించి ఆయన భవిష్యవాణి చెప్పారు.

 నోస్ట్రడామస్ చెప్పిన దాని ప్రకారం 2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  కరోనా మహమ్మారితో పెద్ద ప్రమాదమేమీ లేదు కానీ.. దాని తరువాత ప్రపంచ వ్యాప్తంగా దారుణమైన కరువు పరిస్థితులు మాత్రం ఏర్పడే అవకాశముంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా వెల్లడించింది. ఇక ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ సైజులో ఉన్న ఓ భారీ ఉల్క భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇది భూమిడి ఢీకొట్టే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. అది భూమిని దాటే వరకు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని చెబుతున్నారు. ఈ ఏడాది సౌర తుఫానులు భారీగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు వాతావరణంలో భారీ మార్పుల కారణంగా భూ భ్రమణ వేగం కూడా పెరిగింది.

 నోస్ట్రడామస్ చెప్పినవాటిలో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి.  దుర్మార్గుడైన హిట్లర్ నియంతృత్వ ధోరణిని ఆయన ముందుగానే ఊహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడి హత్య గురించి ముందుగానే హెచ్చరించారు. 9/11 ట్విన్ టవర్స్ ఎటాక్, అమెరికాలోని అతిపెద్ద భూకంపం ఇలా అనేక విషయాల గురించి ఏకంగా 465 ఏళ్ల క్రితమే తన భవిష్యవాణిలో చెప్పారు ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్. వీటితో పాటు 2020లో ఓ గుర్తు తెలియని మహమ్మారి విజృంభించి కోట్ల మంది ప్రాణాలను బలిగొంటుందన విషయం కూడా ఆయన భవిష్యవాణిలో ఉంది. దాని ప్రకారమే కరోనా వచ్చింది. 
2020తో పోల్చితే 2021 మరింత భయానకంగా ఉంటుందని నోస్ట్రడామస్ భవిష్యవాణిలో ఉండడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం.

అయితే 2020లో విజృంభించిన కరోనాను మానవజాతి దాదాపు జయించినట్లే. కోవిడ్ వ్యాక్సిన్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇక భూమికి చేరువగా వస్తున్న ఉల్క కూడా భూమిని ఢీకొనే అవకాశం 40వేలల్లో ఒక్క శాతం కంటే తక్కువ మాత్రమే ఉంది. కరువు పరిస్థితులను తట్టుకోవడానికి ప్రపంచ దేశాలు కూడా ఒక్కటై పోరాడేందుకు, సహాయసహకారాలూ అందించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అంటే ఈ ప్రమాదాలను కూడా  మనం జయించే అవకాశం ఉందని చెబుతున్నారు.