అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన

 

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. రాజధాని మారుతుందన్న ప్రచారంతో రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని ముంపు పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారంపై రైతుల ఆవేదన చెందుతున్న రైతులు తమ గోడును చెప్పుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లి పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్‌ను రైతులు కోరారు.

రాజధాని కోసం భూములు త్యాగం చేశామని, ఇప్పుడు రాజధాని మార్చేందుకు ప్రయత్నిస్తే.. తాము తీవ్రంగా నష్టపోతామని పవన్ కి వినతులు సమర్పించినట్టు సమాచారం. తమకు ఇవ్వాల్సిన కౌలు డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఈ సందర్భంగా రైతులు పవన్ కు తెలిపారు. రాజధానిని మార్చబోతున్నారనే వార్తలతో తాము ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. తమ సమస్యలపై పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. రైతులు చెప్పింది విన్న పవన్‌ వాళ్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నానని వారికి పవన్ చెప్పినట్టు సమాచారం.