టీడీపీకి ‘మెమొరీ లాస్’- పవన్

ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అవిశ్వాసంపై స్పందిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంపై విమర్శలు చేసారు.లోకసభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందని, ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారో చెప్పాలని నిలదీశారు.వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’ కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి?.. దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకి కేంద్రం వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా?.. ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారని అని ట్వీట్ పెట్టారు.

 

 

తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో టీడీపీకి ‘మెమొరీ లాస్’ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాక గతంలో గల్లా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మంచిదని చేసిన వ్యాఖ్యను ఓ వార్త పత్రిక ప్రచురించగా ఆ ప్రతిని పోలుస్తూ నిన్న పార్లమెంట్‌లో గల్లా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడాన్ని పవన్ తప్పుబట్టారు. టీడీపీ మెమొరీ లాస్ తో భాదపడుతుందని ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్ధం కావట్లేదని చెప్పడమే పవన్ ఉద్దేశంగా కనిపిస్తోంది.