పవన్ కి 2+2 సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం


గత కొన్ని రోజులుగా వేగం పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ని దుమ్మెత్తిపోస్తూ, బీజేపీ ని వెనకేసుకు వస్తున్నారు. మొన్నామధ్య జరిగిన గుంటూరు సభలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిందించాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం పై పడటం ఏంటి అని విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, గుంటూరు సభ సమయం‌లో సెక్యూరిటీ కావాలని ఏపి డీజిపిని పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థనని గౌరవించిన ఏపీ ప్రభుత్వం 2+2 భద్రతను ఏర్పాటు చేసింది. దీంతో నలుగురు గన్‌మెన్లను రెండు షిఫ్ట్‌ల్లో ప్రభుత్వం కేటాయించింది. తమపై తీవ్ర మైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, అవేవి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ విషయంలో తగిన శ్రద్ధ తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.