విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత: పవన్

 

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. 'విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమన్న ఆయన.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్ బోర్డ్ అధికారుల తీరుని ఖండిస్తున్నామని చెప్పిన పవన్.. విద్యార్థులకు ఉచితంగా రీవాల్యూయేషన్, రీవెరిఫికేషన్ చేయాలనీ డిమాండ్ చేశారు.