ఎవరికి భయపడి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు.

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అనంతపురంలో నిర్వహించిన సీమాంధ్రహక్కుల చైతన్య సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్ ఏపీ ప్రత్యేక హోదాను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రుల మధ్యే సరైన స్పష్టం లేదని అరుణ్‌జైట్లీ ఒక మాట చెబితే..వెంకయ్యనాయుడు మరో మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏ విధంగానైతే తలుపులు మూసీ, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి రాష్ట్రాన్ని ఏ విధంగా విడగొట్టారో..ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అర్థరాత్రి వేళ ఉన్నట్లుండి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేశారని అంత హాడవిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏమోచ్చిందని పవన్ ప్రశ్నించారు.