TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కల్యాణ్ కొత్త వ్యూహం.. జాతీయ స్థాయిలో ఫోకస్ పై దృష్టి!

Published on: Sat Jun 6, 2026 10:27AM

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఆ తదననంతర పరిణామాలు  హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఎపిసోడ్ ఊహించని విధంగా పెద్ద వివాదంగా మారడంతో..  పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ రూట్‌ను మార్చేశారు. ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో..  పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.

అయితే  తెలంగాణ వివాదం తర్వాత పవన్ కళ్యాణ్‌ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఫోకస్ కావాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు పవన్ వరుసగా  జాతీయ మీడియా ఛానళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడమే నిదర్శనమంటున్నారు పరిశీలకులు. నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం తెలంగాణ రాజకీయాలకో లేక ఆంధ్రప్రదేశ్ పరిణామాలకో పరిమితం కావడం లేదు. దేశవ్యాప్త ప్రాధాన్యత ఉన్న అంశాలు, జాతీయ ప్రయోజనాలపై ఆయన   గట్టిగా గళం వినిపిస్తున్నారు. పహెల్గాం ఉగ్రదాడి వంటి సున్నితమైన అంశాలపై జాతీయ మీడియాలో స్పందిస్తూ..  లౌకికవాదం పేరుతో కొందరు చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు.

 పవన్ కళ్యాణ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫోకస్ పై దృష్టి పెట్టారనీ,  తద్వారా పొలిటికల్ ఇమేజ్‌ను, జనసేన మైలుజ్ నును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ వివాదాల నుండి పుట్టుకొచ్చిన ఈ వేడిని, పవన్ కళ్యాణ్ తన జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఎటాక్  ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్లుగా..  ఒకవైపు తెలంగాణలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తూనే, మరోవైపు ఢిల్లీ స్థాయి ఫోకస్ సాధించడంపై ఆయన కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు.