చిన్నారి జ్ణానేశ్వరి అదృశ్యంపై పవన్ సమీక్ష
Published on: Sun Jun 14, 2026 9:18AM

కాకినాడ జిల్లా తుని మండ లం సీహెచ్ అగ్రహారంలో గత వారం రోజులుగా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్షించారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. చిన్నారి ఆచూకీని త్వరిత గతిన కనుగొనేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీ ఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
అలాగే దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు కోసం అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, ఇతర నిపుణుల సహకారం తీసుకుని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా జల్లెడ పట్టాలని ఆదేశించారు.ఇప్పటికే ఈ ఘటనపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వారం రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా ఎస్పీ వివరాల ప్రకారం, చిన్నారి కోసం ప్రస్తుతం 400 మంది కిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అత్యాధునిక డ్రోన్ల సహా యంతో విస్తృతంగా శోధనలు కొనసాగుతున్నాయి. అలాగే బాలిక ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పోలీ సులు ఇప్పటికే పరిశీలిం చారు.


