ఈరోజు పవర్ స్టార్ ఎంట్రీ
Published on: Wed Nov 20, 2013 11:28AM

హైదరాబాద్ లో నవంబర్ 14న ప్రారంభమైన చిల్డ్రెన్ ఫెస్టివల్ ఈరోజు(నవంబర్20)న ముగియనున్నాయి. ఈ ముగింపు ఉత్సవాలను ఘనంగా జరుపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్లు తెలిసింది. పవన్ కు అసలే చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి, అదే విధంగా పవన్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండడం వలన ఈ వేడుకకు పవన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఇందుకోసం ఈ కార్యక్రమం జరిగే చోట భారీ బందోస్తును ఏర్పాటు చేసారు. మరి పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలియనున్నది.


