త‌మ వంతు స‌హాయం అందిస్తున్న ప్ర‌ముఖులు!

దేశాన్ని కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ.. జనసేనాని తనవంతు సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ.1 కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఐదు ల‌క్ష‌ల చొప్పున, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ 10 ల‌క్ష‌ల చొప్పున‌, డైరెక్ట‌ర్ అనీల్ ర‌విపుడి ఐదు ల‌క్ష‌ల చొప్పున, రెండు తెలుగు రాష్ట్రాల‌కు సాయం ప్ర‌క‌టించారు. ఎం.పి. సి.ఎం.ర‌మేష్ కోటి రూపాయ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, 50 ల‌క్ష‌లు క‌డ‌ప జిల్లాకు త‌న‌వంతు సాయంగా విరాళం ప్ర‌క‌టించారు.