రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన
posted on Mar 5, 2015 10:01AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత గ్రామాల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం నాడు పర్యటన ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో ఉండవల్లికి వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్తో రైతులు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను పవన్ కళ్యాణ్కి వివరించారు. రాజధానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమని, రోడ్ల కోసం అయితే భూములు ఇస్తామని ఈ సందర్భంగా కొందరు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. రైతుల చేత కన్నీళ్ళు పెట్టించరాదని, భూ సేకరణను ఆపాలని పవన్ కళ్యాణ్ అన్నట్టుగా తెలుస్తోంది.