పూలు చల్లాల్సింది నా మీద కాదు.. వాళ్లమీద...

 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో నిరసన కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా పలాసలో హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన ఈ కవాతులో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగించారు. అయితే పవన్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే.. పవన్‌ కల్యాణ్‌పై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. దీనికి ఆయన మాట్లాడుతూ..పూలు చల్లాల్సింది తనపై కాదని, జనసైనికులపై చల్లాలని అన్నారు. కాగా, ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగానే తాము ఈ రోజు కవాతు నిర్వహించామని అన్నారు.