ఈ నెల 6న పాదయాత్ర చేస్తాం...

 

ఏప్రిల్ 4న తమ కార్యాచరణను ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు... విజయవాడలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.... ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకపోవడం దారుణమని ... సభ సజావుగా జరిగేలా చేయాల్సిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ, వైసీపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటున్నాయని విమర్శించారు.