కర్ణాటక ఎన్నికలో పవన్ ప్రచారం...

 

మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే... కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. అయితే ఆయన ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. ఎందుకంటే, బీజేపీ, టీడీపీ తరపున ప్రచారం అవకాశాలు లేవు. పవన్ తో కర్ణాటకలోని జేడీఎస్ ( జనతా దళ్ సెక్యులర్) పార్టీ  ఇటీవల సంప్రదింపులు జరిపినట్టు, ఆయనతో ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత కుమారస్వామి ప్రకటించారు. మరి ఎవరి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే విషయం ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపువతోంది. మరోవైపు చిక్ బళాపురం, బళ్లారి ప్రాంతాల్లో పవన్ సన్నిహితులు ఉన్నారని, స్వతంత్ర అభ్యర్థులుగా వారు బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఆయా ప్రాంతాల్లో తన సన్నహితుల తరపున పవన్ ప్రచారం చేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..