పవన్ పై పరువునష్టం దావా..!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ పై విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన మళ్లీ చంద్రబాబుపై, లోకేశ్ పై విరుచుకుపడ్డారు. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పవన్ కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదని... ఏపీ ప్రజలకు ఎవరేంటో తెలుసని చెప్పారు. పవన్ దిగజారుడు రాజకీయాలు బాధాకరమని... ఆయన వద్ద తన ఫోన్ నంబర్ ఉందని... ఏవైనా ఆధారాలు ఆయన వద్ద ఉంటే నేరుగా తనకే ఫోన్ చేసి ప్రశ్నించి ఉండొచ్చుకదా అని అన్నారు. తాము ప్రతి ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల కన్నా చిల్లిగవ్వ ఎక్కువున్నా తీసుకోండని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనపై దుమ్మెత్తి పోస్తే, తాను దులుపుకుని పోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన నిరాధారమైన ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకే పవన్ రేటింగ్ ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు.అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేయాలా? వద్దా? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుందని కూడా చెప్పారు.