అంత అయోమయం ఎందుకు..? టీడీపీ, వైసీపీ పై పవన్ సెటైర్..
posted on Mar 16, 2018 1:29PM
కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో లో వైసీపీ, టీడీపీ పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీనిపై జననేన అధినతే పవన్ కళ్యాణ్ స్పందించారు. అవిశ్వాస తీర్మానంపై అంత అయోమయం ఎందుకు జగన్ అని ప్రశ్నించారు. తాను 5వ తేదీన అవిశ్వాసం పెట్టమని ముందుగానే సలహా ఇస్తే, దాన్ని వినలేదు. 23న అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మనసు మార్చుకొని సడన్ గా ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానంపై ఇంత అయోమయం ఎందుకు... అవిశ్వాసంపై అయోమయంలో ఆ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు టీడీపీ పై కూడా ఆయన సెటైర్లు విసిరారు. అసలు టీడీపీ అయితే అవిశ్వాసమే అవసరం లేదని చెప్పిందని, ఇక ఇప్పుడెందుకు అవిశ్వాసం కోరుకుంటోందని పవన్ అడిగారు. ఇంకా తనపై బీజేపీ ఉందన్న వార్తలపై కూడా స్పందించి.. తాను టీడీపీకి చెందిన మనిషిని కాదని, బీజేపీకి చెందిన వాడినీ కాదని ప్రజల మనిషినని చెప్పారు.