మోదీ డౌన్ డౌన్ అని నేను అన్నానా..?చాలా తప్పు

 

గత మూడు రోజులుగా ఏపీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మాటలో కాస్త తేడా వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపైనే కాదు.. అందరినీ టార్గెట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నాడు. ఈరోజు  ప్రశాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్.. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చి, మాట తప్పారంటూ మోడీపై, కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. స్పెషల్ స్టేటస్ పై పోరాటానికి కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే మోడీ ఈ మాటలు చెబుతున్న సమయంలో... 'మోదీ డౌన్ డౌన్... పీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలకు వెంటనే స్పందించిన పవన్... "డౌన్ డౌన్ అని నేను చెప్పానా? ఎవరినీ తక్కువ చేయవద్దు" అంటూ సూచించారు. అది చాలా తప్పు అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఎంత బాధ్యత వహించాలో... ప్రతిపక్ష వైసీపీ కూడా అంతే బాధ్యతను స్వీకరించాలని పవన్ చెప్పారు. ఏపీలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు.