ప్రభుత్వానికి పవన్ హెచ్చరిక.. ఆ పరిస్థితి తీసుకురావద్దు...

 

అగ్రిగోల్జ్ బాధితులకు భరోసా ఇచ్చేందుకు గాను పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లిన ఆయన అగ్రిగోల్డ్ బాధితులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చట్టం బలహీనులకు బలంగా... బలవంతులకు బలహీనంగా పనిచేస్తుందని అన్నారు.అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఏం తప్పు చేయలేదు .. ఏజెంట్లు ఎవరి దగ్గరికి వెళ్లాలి.. వారి పరిస్థితి ఏంటి.. ఏజెంట్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏజంట్లను శవాలపై చిల్లర ఏరుకునే పరిస్థితికి తీసుకురావద్దని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే కల్పించుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్ వ్యవహారంతో రాజకీయ నేతలు లబ్ధి పొందితే వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తా అని హెచ్చరించారు. అసలు తొలి చెక్ బౌన్స్ అయినప్పుడే స్పందిస్తే...సమస్య ఇక్కడిదాకా వచ్చేది కాదని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు ఆగాలని సూచించారు.