మార్చి 14న పార్టీ వెబ్‌సైట్ ప్రారంభిస్తా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యచరణను ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ సభలు, బాధితుల పక్షాన పోరాటాలు చేస్తున్న జనసేనాని పూర్తి స్థాయి రాజకీయ రణరంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు మార్చి 14న జనసేన పార్టీ వెబ్‌సైట్ ప్రారంభిస్తామని ప్రకటించారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన చేనేత గర్జన సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. 2019 మ్యానిఫేస్టో తయారీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని, దీని పేరుతో అర్హత లేని వారు రాజకీయాల్లోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు.