నోట్ల రద్దుతో స్వర్ణకారులు నష్టపోయారు

నోట్ల రద్దుతో స్వర్ణకారులు తీవ్రంగా నష్టపోయారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జరిగిన చేనేత గర్జన సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. తాను చేనేత కార్మికులకు మాత్రమే కాకుండా స్వర్ణకారులకు కూడా అండగా ఉంటానని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా డబ్బున్నవారెవరూ ఇబ్బందులు పడలేదని, కేవలం మధ్యతరగతి ప్రజలు, పేదలు మాత్రమే చాలా ఇబ్బందులు పాలయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు, స్వర్ణకారులను ఆదుకోవడానికి ప్రత్యేకనిధి ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ తన వద్దకు వచ్చాయని అయితే వాటిపై భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానన్నారు.