ముందు మంత్రులతో మాట్లాడతా..

 

ఇటీవలే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజల సమస్యలను తెలుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం వెళ్లిన సంగతి తెలిసిందే. ఉద్దానం వెళ్లి అక్కడ వారి సమస్యలను తెలుసుకొని.. ప్రభుత్వం వారి సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని... వారికి సాయం చేస్తామని తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో సమస్య పవన్ ముందుకు వచ్చింది. అదే పోలవరం రైతుల సమస్య. పోలవరం ప్రాజెక్ట్ నేపథ్యంలో మట్టి డంపింగ్ సమస్యను మూలలంక రైతులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. అధికారులు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని పవన్ కళ్యాణ్ ఎదుట రైతులు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యపై ముందు మంత్రులతో మాట్లాడతా... సమస్య పరిష్కారం కాకపోతే క్షేత్రస్థాయిలో పోరాడుతా అని అన్నారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు నాకు తెలియదు..ప్రభుత్వాన్ని వివరణ కోరుతా.. ప్రభుత్వం స్పందిచకపోతే మూలలంకలో పర్యటిస్తా అని చెప్పారు.