రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ....

 

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రతినిధి రాఘవయ్య మాట్లాడుతూ.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు జనసేన పార్టీ బహిరంగ సభ జరుగుతుందని.. ఇందిరా మైదానంలో పవన్ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారని.. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని.. సభ ప్రశాంతంగా జరగాలని ఎస్పీ జయలక్ష్మీ కోరారని తెలిపారు. కాగా 2008 ఆగ‌స్టు 26న ప‌వ‌న్ అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని తిరుపతిలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా ఎనిమిది సంవత్స‌రాల త‌రువాత ఈరోజు జ‌న‌సేన స‌భ అంశంపై ప్ర‌క‌ట‌న రావ‌డాన్ని అభిమానులు గొప్ప‌ విశేషంగా అభివ‌ర్ణిస్తున్నారు.