ప్రజారాజ్యం విలీనంపై ఎందుకు మౌనం: పవన్

 

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని నేను భావించాను. ఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వ్యవహారాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని భావించే నేను ఆరోజు మౌనం వహించేను. నా కంటే ఎంతో అనుభవజ్ఞులయిన రాజకీయనేతలు ఈ విషయంపై సరయిన నిర్ణయమే తీసుకొని ఉండవచ్చని భావించబట్టే నేను ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగినా నేను మౌనం వహించాను. ఈ ఐదేళ్ళలో నేను ఈ వ్యవహారంపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తీరుని చూసిన తరువాత నేను ఇక సహించలేకనే నేను రాజకీయాలలోకి రావలసి వచ్చింది.