పతంజలి యూటర్న్.. మేం కరోనా మందు తయారు చేయలేదు

కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టామనంటూ పతాంజలి సంస్థ ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పతంజలి యూటర్న్ తీసుకుంది. తాము కరోనాకు ఎలాంటి మందును తయారు చేయలేదని తెలిపింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఔషధ శాఖకు వివరణ ఇచ్చింది. కరోనా కిట్ పేరుతో తాము ఒక ప్యాకేజీని రెడీ చేశామని.. ఇందులో 'దివ్య స్వసరి వతి, దివ్య కొరోనిల్ ట్యాబ్లెట్, దివ్య అను తైల్' ఉంటాయని చెప్పింది. కరోనా కిట్ ను తాము ఇంత వరకు కమర్షిషల్ గా అమ్మలేదని, కరోనా వ్యాధిని ఈ మందు నయం చేస్తుందని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని చెప్పింది. ఈ మందు ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఈ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రమే తాము మీడియా సమావేశంలో వెల్లడించామని తెలిపింది.