పరిటాల శ్రీరామ్ కు ముందస్తు బెయిల్
posted on Jan 9, 2013 3:48PM
పరిటాల శ్రీరామ్ కు బెయిల్ దొరికింది. అనంతపురం జిల్లా కోర్ట్ అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పరిరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై జిల్లా కోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ రోజు తీర్పు చెప్పింది. ఆనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ పై జరిగిన హత్యకుట్రలో పరిటాల రవి కుమారుడయిన పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేడు.
అతను తన లాయర్ ద్వారా ఈ నెల 2వ తేదిన ఆనంతపురం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసాడు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును రేపటికి అనగా బుధవారానికి వాయిదా వేసింది.
పరిటాల శ్రీరామ్ ఈ నెల 7వ తేదిన సింగపూర్ వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తరుణంలో పోలీసులు కేసు నమోదు చేయడం, అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అతని తల్లి పరిటాల సునీత,మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీయే తమను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు ఆరోపించారు.