క‌త్తి మ‌హేష్ ను క్ష‌మించేస్తున్నా..!!

 

శ్రీరాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించిన పరిపూర్ణానంద స్వామి యాత్ర చేపడతానన్నారు.. అయితే పోలీసులు మూడు రోజుల పాటు ఆయన్ని గృహ‌నిర్బంధం చేసారు.. మరోవైపు కత్తి మహేష్ కి నగర బహిష్కరణ విధించారు.. ఆ వెనకే పరిపూర్ణానంద స్వామిని కూడా పంపించారు.. అయితే ఇప్పుడు స్వామికి, కత్తి మీద ఆగ్రహం తగ్గినట్టుంది.. క్షమించేసా అంటున్నారు.

 

 

తాజాగా విజయవాడలో మాట్లాడిన ఆయన.. కత్తి మహేష్ ను క్షమించేస్తున్నా.. ఆయ‌న‌కి విద్య ఉంది.. మేధాసంప‌త్తి ఉంది.. రాముడి గురించి ఆయ‌న స‌రిగ్గా అర్థం చేసుకుంటే, రామ‌ధ‌ర్మాన్ని తెలుసుకుంటే ఆయ‌నా చాలా గొప్ప వ్య‌క్తి కాగ‌ల‌డు అని చెప్పారు.. త్వ‌ర‌లో క‌త్తి మ‌హేష్ కు రాముడి అనుభూతి క‌లుగుతుంద‌నీ, రామ‌నామం గొప్ప‌త‌నం తెలియాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు.. హిందూ స‌మాజం ఎవ‌ర్నీ కొట్టెయ్యాలీ, తిట్టెయ్యాల‌ని చూడ‌ద‌ని.. మ‌నస్ఫూర్తిగా ఆయ‌న్ని హిందూ స‌మాజం అక్కున చేర్చుకోవాల‌ని.. హిందూ ధ‌ర్మం గొప్ప‌త‌నం అదేన‌న్నారు.. అదే విధంగా క‌ఠిన‌మైన చ‌ట్టాలు తీసుకొచ్చి, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన‌ బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌నీ, అప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లుండ‌వ‌న్నారు.. మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాలే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు మూలం అన్నారు.. పిల్ల‌ల‌కు లెక్క‌లు, సైన్స్ నేర్పిస్తారు గానీ, హిందూధ‌ర్మం నేర్పించ‌ర‌ని విమ‌ర్శించారు.