నేను విభజన వాదినే ; పనబాక లక్ష్మీ

 

సీమాంద్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం పదవులు కాపాడుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీమాంద్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ విభజన వాదం అందుకున్నారు.

 

ఇన్ని రోజులుగా ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నా ఏ రోజూ నోరు విప్పని పనబాక లక్ష్మీ ఇప్పుడు మాత్రం అధిష్టానం నిర్ణయానికే తన ఓటు అని ప్రకటించారు. తాను మొదటి నుంచి విభజన వాదినే అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టే తాను నడుచుకుంటానని తెలిపారు. సీమాంధ్రకు కావాలంటే ప్యాకేజీ ఇస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.