అవినీతి పరిపాలనే మా ధ్యేయం: ఎపి డెప్యూటీ సీఎం
posted on Jun 17, 2019 6:53PM
ప్రజా జీవితంలో ఉన్న లీడర్లు మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక చూసుకుని మాట్లాడకపోతే వచ్ఛే సమస్యలేమిటో నారా లోకేశ్ ను చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఒక పదం అటు ఇటు అయినా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం మనకు తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్లోకి ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె సొంత జిల్లా విజయనగరం కు వఛ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తడబడ్డారు. ముఖ్యమంత్రి ఒకటే లైన్తో వెళుతున్నారు.. అవినీతి పరిపాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని శ్రీవాణి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గమనించిన పక్కనున్న పార్టీ నేతలు ఆమెను అప్రమత్తం చేయడంతో ఆమె ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆమెపై ట్రోలింగ్ మొదలెట్టేసింది. ‘‘మీ లక్ష్యం ఏంటో స్వయంగా సెలవిచ్చినందుకు ధన్యవాదాలు మేడం.." మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామంటూ ట్వీట్ చేసింది.