నేడు పాలమూరు ప్రజాగర్జన
posted on Sep 28, 2013 9:50AM
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతు బిజెపి తలపెట్టిన ప్రజాగర్జనకు ఏర్పాటు పూర్తయ్యాయి. పాలమూరులో శనివారం జరుగుతున్న సభకు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ హాజరు కానున్నారు. ఇటీవల బిజెపి ఎల్బి స్టేడియంలో చేసిన మోడి నవభారత యువభేరి సభ సక్సెస్ కావడంతో ఇప్పుడు ప్రజాగర్ఝనను కూడా అదే స్థాయిలో సక్సెస్ చేయాలనుకుంటున్నారు రాష్ట్ర నాయకులు.
తెలంగాణ ఎంపి సీట్ల మీద గట్టి ఆశలు పెట్టుకున్న బిజెపి ఈ సభను ఎలాగైన సక్సెస్ చేయాలని భావిస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణకు మద్దతు తెలపుతున్న పలు సంఘాలతో పాటు టిజెఏసి నేత కొదండరామ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రజాగర్ఝనకు ముందు సుష్మా స్వరాజ్ పలువురు తెలంగాణ నేతలతో సమావేశమవుతారు.