పాక్ కాల్పులకు ఆరుగురికి గాయాలు....


పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దుల్లో తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్ సేనలు ఇప్పుడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. తాజాగా ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో కాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.