పగ తీర్చుకున్న పాక్...

 

ఇండియాలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాక్ చేరవేస్తున్న మహ్మూద్ అఖ్తర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గర్నుంచి పట్టుబడ్డాయి. దీంతో ఆయన్ని దేశం నుండి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. అయితే మన దేశం తీసుకున్న నిర్ణయంపై మండిపోయిన పాకిస్థాన్ వెంటనే ప్రతీకారం తీర్చేసుకుంది. పాకిస్థాన్ లోని భారత ఎంబసీలో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్ పై వేటు వేసింది.  సుర్జీత్ సింగ్ ను తన కుటుంబంతో సహా దేశాన్ని వీడిచి పోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్ కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది.