మళ్లీ పాక్ కాల్పులు.. 12 గంటల్లో 6 సార్లు

 

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఆరుసార్లు కాల్పులు జరిపింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని నౌషేరా, సుంద‌ర్బ‌ని, ప‌ల్ల‌న్‌వాలా సెక్టార్ల‌లో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులకు మన జవాన్లు ధీటైన సమాధానం చెబుతుండగా.. కాల్పుల వల్ల  ఒక బాలిక‌కు గాయాల‌ైనట్టు తెలుస్తోంది. ఇంకా ఈ కాల్పుల్లో  ఒక పాక్ రేంజ‌ర్ హ‌త‌మైన‌ట్లు స‌మాచారం. మరోవైపు ఈ కాల్పుల వల్ల సరిహ్దదు ప్రాంత ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. అంతేకాదు గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని బీఎస్ఎఫ్ సూచించింది.