భారత్-పాక్ సైన్యం మధ్య భీకర కాల్పులు..

ఎన్నిసార్లు చావు దెబ్బ తిన్నా పాకిస్థాన్ సైన్యం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా వద్ద భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరిపింది. సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని యథేచ్చగా కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో 8 పాక్ రేంజర్ల పోస్టులు ధ్వంసమవ్వగా..ఆరుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. ఈ కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.