పాక్ గూఢాచారి అరెస్ట్...

 

పాక్ సైన్యం భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఓ గూఢాచారిని జ‌మ్మూక‌శ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి రెండు సిమ్ కార్డులు, మ్యాప్‌లను భ‌ద్ర‌తా ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాక్‌కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అత‌న్ని భ‌ద్ర‌తా ద‌ళాలు విచారిస్తున్నాయి. మరోవైపు బారామల్లులో ఇద్దరు జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులను హతమార్చారు. క‌థువా జిల్లాలోని హీరాన‌గ‌ర్ సెక్టార్‌లో ఏడుగురు పాక్ రేంజ‌ర్లు హ‌త‌మైన నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది.