TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైభవంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు

Published on: Sun Oct 5, 2025 2:41PM

 

ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం వద్ద జెండా ఊపి ఈ ఉత్సవాల శోభాయాత్రను మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. 

అనంతరం గిరిజన మహిళలతో కలిసి హొం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దింసా నృత్యం చేశారు. మరోవైపు కళాకారుల పులివేషాలు, నృత్యలు ఆకట్టుకున్నాయి. సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పోటైత్తారు. స్థానిక సంగీత కళాశాలలో కార్యక్రమాలను అట్టహాసంగా ప్రారంభించారు.

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతి పెద్ద జాతరలలో ఒకటి. ప్రతి సంవత్సరం తోలేళ్ల ఉత్సవంతో ప్రారంభమై, ఉయ్యాల కంబాల జాతరతో ముగిసే ఈ సిరిమాను సంబరాలకు ఏర్పాట్లు రెండు నెలల ముందుగానే మొదలవుతాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొనే ఈ వేడుకలు ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.