ఓయూలో మళ్ళీ ఉద్రిక్తత

 

విద్యార్థుల ఆందోళనలతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓయూ విద్యార్థులు మంగళవారం వర్సిటీలోలో ఆందోళనకు దిగారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాకకు ర్యాలీగా వెళ్లారు. అయితే తార్నాక పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కొంతమంది విద్యార్ధి నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.