టీ మంత్రుల్ని తరిమి కొడతాం: ఓయు స్టూడెంట్స్

 

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వాస్తవంగా శాంతి కాముకులు. అయితే వారికి ఆగ్రహం వచ్చిందంటే వారిని ఆపడం ప్రభుత్వం, పోలీసుల వల్ల అయ్యే ఛాన్స్ లేదు. వారికి ఆగ్రహం తెప్పించేది రాజకీయ నాయకులే. అలాగే రాజకీయ నాయకుల చెవిలో పువ్వు వ్యవహారాలు ఉస్మానియా విద్యార్థుల దగ్గర మాత్రం కుదరవు. గతంలో ఇలా ప్రయత్నించిన అనేకమంది నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి గుణ ‘పాఠాలు’ నేర్చుకున్నారు. అందుకే ఉస్మానియా ఏరియాకి వెళ్ళాలంటే చాలామంది రాజకీయ నాయకులకు దడ. ఇదిలా వుంటే, ఉస్మానియా విద్యార్థి లోకం మరోసారి ఆగ్రహించింది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థులు గుర్రుగా వున్నారు. అందుకే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అడుగుపెడితే మంత్రులని కూడా చూడకుండా తరిమి కొడతామని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఆ యూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్ విద్యార్థులను సముదాయించేందుకు మొన్నీమధ్య వెళ్లిన మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డిని అడ్డుకున్నారు. మంత్రులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. వీరి ధాటిని తట్టుకోవడం మంత్రులకు కష్టమైపోయింది. అందువల్ల ఉస్మానియా విద్యార్థులు మంత్రులను తరిమి కొడతామని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాకి వెళ్ళకపోవడం మంచిది.